ఇలా చేస్తే ఏకంగా రూ.42,30,000 వస్తాయి!
ఎవరైనా సరే పదవీ విరమణ తర్వాత, మొత్తం EPFO లేదా ఇతర పథకాల ద్వారా అందుకుంటారు. ఒకవేళ మీరు ఈ డబ్బును బ్యాంకు ఖాతాలో ఉంచినట్లయితే..అది క్రమంగా క్షీణిస్తుంది. అదేవిధంగా దానిపై మీకు ఎక్కువ వడ్డీ లభించదు. ఇటువంటి పరిస్థితిలో ఎక్కువ వడ్డీ పొందడానికి మనం డబ్బును పెట్టుబడి లాగా పెట్టాలి. ఈ క్రమంలో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు పెట్టుబడికి చాలా మంచిది. అయితే, ఈ పథకం ఇతర పథకాలతో పోలిస్తే అధిక వడ్డీ ఇస్తోంది.
8.2 శాతం వడ్డీ
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది ఒక డిపాజిట్ పథకం. ఇందులో 5 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పథకంలో మీరు గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కాగా, ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే..ఒకవేళ మీరు 5 సంవత్సరాలకు రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే..5 సంవత్సరాల తర్వాత మీకు 8.2 శాతం చొప్పున రూ. 12,30,000 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీలో మీకు రూ.42,30,000 లభిస్తుందని అర్థం.
సీనియర్ సిటిజన్లు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు
దేశంలోని సీనియర్ సిటిజన్లు అంటే దాదాపు 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్లో పెట్టుబడి పెడతారని పథకం పేరును బట్టి మనం తెలుస్తోంది. అయితే సివిల్ సెక్టార్, డిఫెన్స్ ఉద్యోగులకు కొన్ని షరతులతో మినహాయింపు లభిస్తుంది. కాగా, ఈ పథకం 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయినప్పటికీ..మీరు 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలనుకుంటే.. మీరు దానిని మూడు సంవత్సరాల పాటు కూడా పొడిగించవచ్చు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పొడిగించిన ఖాతాపై వడ్డీ రేటు మెచ్యూరిటీ తేదీ నుండి వర్తిస్తుంది. ఈ పథకం యొక్క మరో విశేషం ఏమిటంటే..ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది.